టీజర్ టాక్ : ఒక్కడు మిగిలాడు

గత కొన్నాళ్లుగా తన వేగాన్ని తగ్గించిన మంచు మనోజ్..ప్రస్తుతం ఒక్కడు మిగిలాడు సినిమాతో బిజీగా వున్నాడు. అజయ్ నూతక్కి అనే యువ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. తాజా ఈ సినిమా టీజర్ బయటికి వచ్చింది.

‘చిందేస్తూ నా ప్రాణాన్ని.. చిందిస్తా నా రక్తాన్ని. నీ దోసిళ్లల్లో పోస్తా, ఏరులై పారిస్తా నా తండ్రి. తల ఎత్తి తిరగాలి రా, రొమ్ము విరిచి నడవాలిరా నా తండ్రి. వీరులు ఏడవకూడదు, వీరులు ఏడవకూడదు నాన్న… దేశం వర్థిల్లాలి’ అంటూ మంచు మనోజ్‌ భావోద్వేగభరితంగా పలుకుతున్న డైలాగ్‌తో ఈ టీజర్‌ను రివీల్ చేశారు. టీజర్ లో హెవీ యాక్షన్ ఉంది.

వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రమిది. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.