సైరా మొదటి రివ్యూ వచ్చేసింది…

అదేంటి సినిమా విడుదల కు ఇంకా చాల రోజులే ఉంది కదా..అప్పుడే రివ్యూ రావడం ఏంటి అనుకుంటున్నారా..అదేమీ లేదండి ..ఇప్పటివరకు సినిమా కు సంబందించిన విశేషాలను ఎవరు మీడియా ఎదురుగా చెప్పలేదు..మొదటిసారి ఈ సినిమా ఎలా ఉండబోతుందో..ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయబోతుందో ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు. అందుకే మొదటి రివ్యూ అని చెప్పడం జరిగింది. ఇంతకీ ఈ సినిమా పట్ల ఈయన ఏమ్మన్నారంటే..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తనికెళ్ళ భరణి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ .. ఈ సినిమా మెగాభిమానుల అంచనాల్ని మించి ఉంటుందని .. సైరా సరికొత్త చరిత్రను సృష్టిస్తుందని అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని మరింత పెంచుతుందని పొగిడేశారు. ఆలస్యానికి చింతించ వద్దని అభిమానులకు ఆయన సూచించారు. కష్టే ఫలి. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందన్న సామెత ఉంది కదా!.. అది ఖచ్చితంగా ఈ సినిమాలో కనిపిస్తుంది. సైరా సినిమాలో నేను ఓ కొత్త తరహా పాత్రలో నటిస్తున్నా. ఆ అవకాశం నాకు రావడం సంతోషంగా ఉంది. నన్ను తెలుగు ప్రేక్షకులు ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నా.. అని భరణి చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం చివరి దశకు సైరా చేరుకుంది. ముందునుండి చెప్పినట్లే ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా , బిగ్ బి అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయసేతుపతి, అనుష్క, తమన్నా వంటి స్టార్ నటి నటులు నటిస్తున్నారు.