Site icon TeluguMirchi.com

మాన‌వ హ‌క్కుల నేత‌గా టబు..

కూలి నెం 1 చిత్రం తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన టబు..ఆ ఆతర్వాత నిన్నే పెళ్లాడతా సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. కృష్ణవంశీ డైరెక్షన్లో నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా టబు కెరియర్ లో ఎవర్ గ్రీన్ మూవీ గా నిలిచింది. ఆవిడ మా ఆవిడే, చెన్నకేశవ రెడ్డి , అందరివాడు, పాండురంగడు వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల కు దగ్గరయింది. ఇక చాల గ్యాప్ తర్వాత ఈమె తెలుగులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

‘నీది నాది ఒకే కథ’ డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’ తాజాగా ‘విరాటపర్వం’ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ లో రానా, సాయిప‌ల్ల‌విలను హీరో హీరోయిన్లు గా నటిస్తుండగా..ప్రియమణి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ట‌బు మాన‌వ హ‌క్కుల నేత‌గా కనిపించబోతుంది సమాచారం.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై నుండి షూట్ కి వెళ్ళనుంది. ఈ సినిమాను హిందీ, తమిళ భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రానా పాత్ర కొంత నెగిటివ్ యాంగిల్ ఉంటుందని అది సినిమాలో కొత్తగా అనిపిస్తోందని దర్శకుడు అంటున్నాడు. మరి అది ఎలా ఉంటుందనేది చూడాలి.

Exit mobile version