దుబాయ్ లో సిద్దు తాప్సీ !

taaps-siddhardhసిద్దార్ద్ తాప్సీ కలిసి నటించిన తాజా బాలీవుడ్ చిత్రం ‘చష్మే బదూర్’. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 5న విదులకు సిద్దమైంది. ఈ చిత్రం వరల్డ్ ప్రీమియర్లో ప్రదర్శించడానికి సిద్దు తాప్సీ కలసి దుబాయ్ వెళ్లనున్నారు. ఈ చిత్రం తో బాలీవుడ్ జనాలకి కనబడడానికి తాప్సీ కొన్ని వారాలుగా ఎదురుచూస్తుంది. ప్రచారం కార్యక్రమాలు కుడా బాగానే చేస్తున్నారు. ఇటివలే మొదలైన ఈ పబ్లిసిటీ కాంపెయిన్లో ఈ ఇద్దరు తారలు ముంబాయిలో ఒక కాలేజీలో స్టూడెంట్స్ ని కలిసారు. ఇక ఈ చిత్రం గురించి తాప్సీ మాట్లాడుతూ… ”ఇది నా మొదటి బాలీవుడ్ చిత్రం. చాలా త్రిల్ ఇచ్చింది. మంచి విజయం సాదిస్తుందన్న నమ్మకం వుంది. తమిళ్ , తెలుగు లో నటించాను అని తెలుసు కనుక నా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. తప్పకుండ అందరికి నచ్చుతుదన్న నమ్మకం వుంది ” అని తెలిపింది. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అలీ జాఫర్, దివెయుందు శర్మ మిగిలిన ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. మరో వైపు తాప్సీ తెలుగులో నటించిన షాడో, సాహసం చిత్రాలు విడుదలకు సిద్దంగా వున్నాయి.