స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం `సైరా నరసింహారెడ్డి`. చిరంజీవి హీరోగా నటించగా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసాడు. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 02 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ను షేక్ చేసింది. చిరంజీవి నట విశ్వరూపం, సురేందర్ రెడ్డి డైరెక్షన్, రామ్చరణ్ నిర్మాణ విలువలు ఇలా అన్ని భారీగా ఉండడం తో సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.
ఇక ఫస్ట్ షో దేశ వ్యాప్తంగా రూ. 50 కోట్ల షేర్ను రాబట్టినట్లు ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి… మరోవైపు విదేశాల్లోనూ సైరా సత్తా చాటుతున్నాడు ఫస్ట్ డేనే దాదాపు రూ. 10 కోట్లు షేర్ రాబట్టినట్టు సమాచారం.
ఈ మూవీ అమెరికా ప్రీమియర్ షోలలో 308 లొకేషన్లలో 8,57,765 డాలర్స్ అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.6.16 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆసీస్లోనూ మంచి ఓపెనింగ్స్ దక్కాయి.. ఆస్ట్రేలియాలో 39 లొకేషన్లలో 189,237 డాలర్లు సాధించినట్లు సమాచారం. ఫస్ట్ రోజే యూఎస్లో వన్ మిలియన్ మార్కును దాటేసినట్టు సైరా టీమ్ ప్రకటించింది.