Site icon TeluguMirchi.com

చరణ్ ను ఇబ్బంది పెడుతున్న సైరా వివాదం ..

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి చిత్రం మరో నాల్గు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపాయడంలో సైరా చిత్ర వివాదం రోజు రోజుకు ముదురుతుండడం..కోర్ట్ ల వరకు వెళ్తుండడం అభిమానులతో పాటు చిత్ర యూనిట్ సైతం కలవరపెడుతుంది.

‘సైరా’ చిత్రానికి కథ విషయంలో సహకారం అందించినందుకుగాను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులకు చిత్ర నిర్మాత రామ్ చరణ్ డబ్బు ఇస్తానని మాటిచ్చి ఇప్పుడు ఇవ్వకుండా మోసం చేశారని వారు కోర్టులో పిటిషన్ వేశారు. ‘సైరా’కు సెన్సార్ సర్టిఫికెట్ జారీని, చిత్ర విడుదలను నిలిపివేయాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.

గురువారం ఈ పిటిషన్ విచారణకు రాగా చిత్రానికి ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని సెన్సార్ బోర్డ్ తెలిపిందట. దీంతో కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం కోర్టు ఏ తీర్పు ఇస్తుందో..సినిమా అనుకున్న టైం కు రిలీజ్ అవుతుందా కదా..అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. సినీ విశ్లేషకులు మాత్రం పెద్ద సినిమా వస్తుందంటే ఇవన్నీ మాములే..అనుకున్న తేదీకే సినిమా వస్తుందని వారంతా అంటున్నారు.

Exit mobile version