Site icon TeluguMirchi.com

సైరా టార్గెట్ 2.0..?

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సైరా నరసింహ రెడ్డి చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా..నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ప్రస్తుతం చిరు & చరణ్ 2.ఓను టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

రజనీకాంత్ నటించిన ఈ సినిమా శాటిలైట్+డిజిటల్ డీల్ లో సౌత్ లోనే అతిపెద్ద రికార్డు. ఏకంగా 110 కోట్ల రూపాయలకు ఈ హక్కులు అమ్ముడుపోయాయి. ఇప్పుడా రికార్డును అధిగమించాలని, కుదరని పక్షంలో కనీసం సమం చేయాలని సైరా చూస్తుంది. వీరి టార్గెట్ బాగానే ఉన్నప్పటికీ అది తీరడం కష్టమని అంత అంటున్నారు. సైరా చిత్రాన్ని110 కోట్ల రూపాయలకు కొనేందుకు టీవీ ఛానెళ్లు ఆసక్తి చూపించడం లేదు. వాస్తవానికి ఈ సినిమాలో అన్ని భాషల టాప్ నటి నటులు నటిస్తున్నారు. కానీ ఎందుకో ఈ సినిమాకు పాన్-ఇండియా బజ్ రావడం లేదని అంటున్నారు. అందుకే ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రావట్లేదట. మరి చివరికి ఎంతకు అమ్ముతారో చూడాలి.

Exit mobile version