వారి కోసం సైరా ప్రత్యేక షో..

మెగా స్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి చిత్రం మరో 10 రోజుల్లో తెలుగు , తమిళ్ , హిందీ , మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకొని ప్రమోషన్ కార్య క్రమాలు చేస్తుంది. కొద్దీ సేపటి క్రితం ప్రీ రిలీజ్ వేడుక మొదలు అయ్యింది. ఇక చిత్ర ప్రమోషన్లో భాగంగా చరణ్ మాట్లాడుతూ..

బాలీవుడ్ లోని కొంతమంది ప్రముఖలకు సైరా స్పెషల్ షోను వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. సినిమా రిలీజ్ దగ్గరలో వారికీ ఈ షో వేయాలని చూస్తున్నట్లు తెలిపాడు. మరి ఆ షో చూసే ప్రముఖులెవరో మాత్రం తెలుపలేదు. అలాగే ఈ సినిమా కోసం బిగ్ బి ఒక్క రూపాయి తీసుకోలేదని తెలిపాడు. కేవలం చిరుతో తనకున్న అనుబంధం కారణంగానే అమితాబ్ ఈ చిత్రంలో నటించారని చెప్పుకొచ్చాడు.