ఒక్క వార్ కు అన్ని కోట్లా..?

మెగా స్టార్ చిరంజీవి – సురేందర్ రెడ్డి కలయికలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన చిత్రం సైరా నరసింహ రెడ్డి . గాంధీ జయంతి సందర్భాంగా అక్టోబర్ 02 న వరల్డ్ వైడ్ గా తెలుగు , తమిళ్ , హిందీ , కన్నడ , మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రీసెంట్ గా సెన్సార్ సైతం పూర్తి చేసుకొని యూ/ ఏ సర్టిఫెక్ట్ దక్కించుకుంది.

ఇక సినిమా ప్రమోషన్లలో సినిమాకు సంబందించిన అనేక విషయాలు బయటకొస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ చిత్రం లో ఓ వార్ ఎపిసోడ్ కోసం జార్జియా దేశంలో ఒకటిన్నర నెలకు పైగా షూట్ చేశారట. దాని కొరకు అక్షరాలా 75కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపి ఆశ్చర్య పరిచారు. మరి అన్ని కోట్లు పెట్టి సి\షూట్ చేసేరంటే తెరపై ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలనే ఆత్రుత అందరిలో పెరుగుతుంది.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, తమన్నా నటిస్తుండగా…,అమితాబ్,జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది అందించారు.