Site icon TeluguMirchi.com

ముంబై లో చిరు సందడి షురూ..

మెగాస్టార్ చిరంజీవి – నయనతార జంటగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ ప్రధాన రోల్ లో నటించిన చిత్రం సైరా నరసింహ రెడ్డి. ఉయ్యాలా నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 02 న తెలుగు తో పాటు మిగత సౌత్ & నార్త్ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ముంబై లో సైరా ఈవెంట్ లో హాజరయ్యాడు.

మెగా టీమ్ అక్కడ భారీ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ ప్రచార కార్యక్రమాల్లో అమితాబ్ సైతం పాల్గొనే అవకాశాలున్నాయట. చిరుకి బాలీవుడ్ కొత్తేమీ కాదు. కానీ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇస్తుండటంతో ఆయన కూడా ఎగ్జైట్ అవుతున్నారు.

ఈ సినిమాని హిందీలో ఫరాన్ అఖ్తర్ రిలీజ్ చేస్తున్నాడు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అయితే భారీ ఓపెనింగ్స్ రావాలంటే ఈ హైప్ సరిపోదు. అందుకే ఇప్పుడు ఆ సినిమాలో చిరంజీవి గురువు గోసాయి వెంకన్న పాత్రలో నటించిన అమితాబ్ కూడా రంగంలోకి దిగారు. అమితాబ్ వల్లే ఈ సినిమాకి అక్కడ అంత భారీ రిలీజ్ ప్లాన్ చేసారు. కానీ ఇప్పటివరకు బిగ్ బి ఈ సినిమాకి సంబంధించి ఏ ఈవెంట్‌లో కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం సైరా కోసం రంగంలోకి దిగారు.

Exit mobile version