‘సీతమ్మ’ ప్లాటినం పండగ ఈ రోజే

Seethamma-Vakitlo-Sirimalle-Chettuవెంకటేష్, మహేష్ బాబు ప్రధాన పాత్రలలో వచ్చిన సినిమా ‘సీతమ్మ సిరిమల్లె చెట్టు’. ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం… విడుదలైన అన్ని ఏరియాలలో సూపర్ హిట్ టాక్ రావడంతో పాటు, మిక్కీ.జె మేయర్ అందించిన మ్యూజిక్ హిట్ కావడంతో ఈ సినిమా ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకని చేయనున్నారు. ఈ ప్లాటినం డిస్క్ వేడుక ఈ రోజు శిల్పకళావేదికలో జరగనుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈసినిమాలో సమంతా, అంజలి హీరోయిన్స్ గా నటించగా కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, జయసుధ నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ నేపధ్య సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాటినం డిస్క్ వేడుకలో ఈ చిత్రంలో నటించిన అందరు నటీనటులు టెక్నీషియన్స్ హాజరు కానున్నట్లు సమాచారం. కుటుంబ కధా నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అఖండ విజయం సాదించడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.