స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ.జ్ఞానవేల్రాజా సూర్యతో ఓ స్టైయిట్ తెలుగు చిత్రాన్నిప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి లింగు స్వామి ని దర్శకుడిగా అనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ లో లింగు స్వామి స్థానం లో ఓ టాలీవుడ్ దర్శకుడు పేరు వినిపిస్తుంది. విశ్వసనీయ సమాచారం మేరకు… ఈ సినిమా కోసం ఇప్పటికే కథతో పాటు దర్శకుడిని కూడా సిద్ధం చేశారని టాక్. టాలీవుడ్ దర్శకుడు వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం వి.వి.వినాయక్ తన తొలి చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఏప్రిల్లో విడుదల అయ్యే అవకాశం వుంది. ఆ తర్వాత సూర్య సినిమాకే వినాయక్ దర్శకత్వం వహిస్తారని వినిపిస్తుంది.ఇందుకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.