సూర్య-గౌతమ్మీనన్ కలయికలో రాబోతున్న సినిమా ధ్రువనక్షత్రం. అమలాపాల్ కథానాయిక. ఈ సినిమాలో సూర్యకు తల్లిగా సిమ్రాన్ కనిపించనుంది. అయితే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టేట్టు ఉంది. ఎందుకంటే ఈ స్ర్కిప్టు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధంకాలేదట. ఈలోగా సూర్య, లింగుస్వామి దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. అయితే ధ్రువ నక్షత్రం సినిమా పూర్తిగా ఆగిపోయిందని, సూర్య ఈ సినిమా చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. దీన్ని గౌతమ్ ఖండించారు. మా ఇద్దరి కలయికలో సినిమా రావడం ఖాయం. కాకపోతే కాస్త ఆలస్యం అవుతుందంతే.. అని ట్విట్టర్లో సందేశం పంపారు. దాంతో ఈ ఊహాగానాలకు తెర పడింది.