ఎన్జీకే ప్లాప్ ఫై సూర్య ఏమన్నాడో తెలుసా..?

సూర్య – రకుల్ ప్రీతి సింగ్ – సాయి పల్లవి జంటగా సెల్వరాఘవన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ఎన్జీకే. మే 31 న తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల అయ్యింది. మొదటిసారి సూర్య పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో నటించడం తో ఈ సినిమా ఫై అభిమానులు , ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ వారి అంచనాలను అందుకోవడం లో సినిమా విఫలం అయ్యింది. రెండు చోట్ల మొదటి రోజు మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు పెద్దగా రాబట్టలేకపోయింది.

తాజాగా ఈ సినిమా పట్ల వస్తున్న కామెంట్స్ పట్ల సూర్య తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. “ఎన్జీకే చిత్రంపై మీ అభిప్రాయాలని, ప్రేమని, ఆలోచనలని గౌరవంగా స్వీకరిస్తున్నా. అలాగే చిత్రంలో నటీనటుల పెర్ఫామెన్స్ ని మెచ్చుకున్న వారందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు” అని ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం సూర్య కెవి ఆనంద్ దర్శకత్వంలో “కాప్పాన్” అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.