సన్నీ లియోనీ మళ్ళీ తల్లయింది

సన్నీ లియోనీ మరో ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. 2017 జూన్‌లో నిషా అనే చిన్నారిని దత్తత తీసుకున్న సన్నీ, డేనియల్‌ వెబర్‌ దంపతులు ఇప్పుడు సరోగసీపద్ధతి ద్వారా కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు.

‘దేవుడి ప్లాన్‌ ఇది . కొన్ని వారాల క్రితమే వీరిద్దరూ పుట్టారు. భగవంతుడు మా కోసం ఏదన్నా ప్రత్యేకంగా చేయాలనుకున్నాడు. అందుకే మాకు ఈ రకంగా ముగ్గరు పిల్లలను ఇచ్చాడు.’ అని ట్వీట్‌లో చేసింది సన్నీ.

కాగా ఇది వరకు షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, తుషార్ కపూర్, టాలీవుడ్ కి వస్తే మంచు లక్ష్మి తదితరులు ‘సరోగసి’ ద్వారా = పిల్లల్ని పొందిన సంగతి తెలిసిందే.