కమెడియన్ గా కెరియర్ మొదలు పెట్టిన సునీల్ , ప్రస్తుతం హీరో గా హిట్ , ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. శ్రీ రాములయ్య , జయం మనదే రా , భద్రాచలం , జై బోలో తెలంగాణ మొదలగు చిత్రాలను తెరకెక్కించిన ఎన్. శంకర్ దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెల్సిందే. ఇక ఈ చిత్ర పూజ కార్యక్రమాలు ఈరోజు ఉదయం అన్నపూర్ణ స్టుడియోలో జరుపుకుంది.
ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్, సినీయర్ దర్శకుడు దాసరి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సునీల్పై కేటీఆర్ క్లాప్ కొట్టగా.. దాసరి నారాయణరావు కెమెరా స్విచ్ ఆన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో ఫేమస్ డైలాగ్ అయినా ‘నేను తేనెపట్టు లాంటోడిని.. పిండితే హనీ.. అమ్మితే మనీ’ అనే డైలాగ్ చెప్పి సునీల్ నవ్వించాడు.
మలయాళం లో సూపర్ హిట్ అయినా ‘టూ కంట్రీస్’ చిత్రానికి రీమేక్ గా తెలుగు లో ఈ మూవీ రాబోతుంది. మహాలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.2 చిత్రం ఎన్.శంకర్ దర్శక నిర్మాణంలో ఈ మూవీ రాబోతుంది. మలయాళంలో `టు కంట్రీస్` చిత్రానికి సంగీతం అందించిన గోపీసుందర్ తెలుగులో సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీధర్ సీపాన సంభాషణలు. ఓరిజినల్ ప్లేవర్ మిస్ కాకుండా స్క్రిప్ట్ను బెటర్ మెంట్ చేసి మన నెటివిటీకి తగినట్లు అన్నీ ఎలిమెంట్స్తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు శంకర్ తెలిపాడు.