మిస్టర్ పెళ్లికొడుకు దారుణంగా దెబ్బతీయడంతో కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.. సునీల్. తడాఖా విజయంతో మళ్లీ ఊపిరి పీల్చుకొన్నాడు. ఇప్పుడు దసరా బుల్లోడుగా సిద్దం అవుతున్నాడు. ఈ సినిమాకి అంతకు ముందు.. భీమవరం బుల్లోడు అనే టైటిల్ పెట్టారు. అయితే ఆంధ్రా, తెలంగాణ గొడవల నేపథ్యంలో దసరా బుల్లోడుగా మార్చారు. ఉదయ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎస్తేర్ కథానాయిక. చిత్రీకరణ తుదిదశకు చేరుకొంది. దసరాకి ఈ దసరాబుల్లోడుని తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. అతి త్వరలోనే పాటల్న వినిపిస్తారట.