మిధునం సినిమాతో తనలోని దర్శకుడిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించుకొన్నారు తనికెళ్లభరణి. ఇప్పుడు మరోసారి మెగాఫోన్ పట్టుకోబోతున్నారు. ఆయన సునీల్తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కన్నప్ప అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారమ్. 2014 ప్రథమార్థంలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్తుంది. భరణికి శివుడంటే చాలా ఇష్టం. ఆయన పరమ భక్తుడి పేరు ఈ సినిమాకి పెట్టారు. ఆనాటి భక్త కన్నప్పని తెరపై చూపిస్తారా? లేదంటే ఈ కన్నప్ప కథ వేరా?? అనేది తెలియాల్సివుంది.