అందరికి జాగ్రత్త చెపుతున్న యంగ్ హీరో..

“నిను వీడని నీడను నేను” చిత్రంతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చిన యంగ్ హీరో సందీప్ కిషన్..తాజాగా అందరికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త చెపుతున్నాడు. “ఆరోగ్యం పట్ల జాగ్రతగా ఉండండి, నాకు తెలిసిన వారిలోనే చాలా మంది వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. నేను కూడా 102 ఫీవర్ తో రెండు రోజులుగా బాధపడుతున్నాను, వాతావరణ మార్పు ప్రభావంతో ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి” అని ట్వీట్ చేసాడు.

ఈయన చేసిన ట్వీట్ పట్ల అందరి హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సినిమాలకు సంబందించిన విషయాలను మాత్రం చెపుతుంటారు. కానీ సందీప్ మాత్రం ఇలా ఆరోగ్యం గురించి కూడా చెప్పడం ఆనందంగా ఉందని నెటిజన్లు , ఆయన అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు . ప్రస్తుతం సందీప్ తెలుగులో తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్ చిత్రంతో పాటు, తమిళంలో మరో రెండు చిత్రాలలో నటిస్తున్నారు.