దాసరి లేరనకండి ప్లీజ్ ..

దర్శకరత్న దాసరి నారాయణరావు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయన్ని స్మరించుకుంటున్నారు. ఆయనతో వున్న అనుబంధం ను గుర్తు తెచ్చుకొని, ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవలను మననం చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో దశకుడు క్రిష్, సుకుమార్ ఆయనను ఉద్దేశించిన లేఖలు కదిలించాయి. ‘దర్శకుడే సినిమాకి కెప్టెన్‌’ అని ఎక్కడ ఎవరన్నా, అక్కడ దాసరి వుంటారు అని చెప్పాడు. ఏ తెలుగు దర్శకుడికి గౌరవం దక్కినా అందులో దాసరి ఉంటారు. ‘పెద్దాయన విశ్రాంతి తీసుకుంటున్నారు.. లేరనకండి’ అని క్రిష్‌ తన లేఖలో రాశారు.

‘మీరు యాక్షన్‌ అంటే ఎలాంటి నటుడైనా వెండితెరపై మరణించేవారు.. కట్‌ అనగానే బతికి స్టార్లయిపోయేవారు.. మా దర్శకులమంతా ముక్తకంఠంతో యాక్షన్‌ అంటున్నాం, ప్లీజ్‌ ఒక్కసారి బతుకు నటించరూ.. మీమీదొట్టు, ఇక మేం కట్‌ చెప్పేది లేదు” అని తన ఆవేదనను లేఖ ద్వారా వ్యక్తం చేశాడు సుకుమార్.