ఇంట్రెస్టింగ్ గా ‘మామా మశ్చీంద్ర’ టీజర్ !


నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మామా మశ్చీంద్ర’. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను శ్రీ‌వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్ పై సునీల్ నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు దుర్గా, ప‌ర‌శురామ్‌, డీజె గా మూడు విభిన్న‌మైన క్యారెక్ట‌ర్ల‌లో కనిపించనున్నాడు. కాగా ప‌ర‌శురామ్ ఓల్డ్ డాన్‌.. దుర్గ అండ్ డీజే మంచి ఫ్రెండ్స్‌. ఇక కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబుకు జోడీగా ఈషా రెబ్బా, మృణాలిని రవి నటిస్తున్నారు.

అయితే తాజాగా మహేష్ బాబు ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశాడు. ఇక టీజర్ లో.. ‘దేవుడు అడిగాడట నన్ను చేరడానికి ఏడు జన్మలు భక్తుల్లా బతుకుతారా? లేక మూడు జన్మలు రాక్షసుల్లా బతుకుతారా? అని. మీకు దూరంగా ఉండటం కన్నా మూడు జన్మలు రాక్షస జన్మే మిన్న అని దేవతలే కోరుకున్నారట. వేగం ఎక్కువైతే ఆగం అవుతావు కాకా, కిక్కు కోసం వెళ్తే కక్కొస్తుంది. ఈ జెనరేషన్ గుంటలందరికీ సిక్స్ ప్యాక్ పిచ్చిపట్టింది. ఫ్యామిలీ ప్యాక్ ఉన్నోడు ఫ్యామిలీని సుబ్బరంగా చూసుకుంటాడు’ అనే డైలాగ్స్‌ మంచి ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేస్తున్నాయి.