మెగాస్టార్ చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ లో విజయ్ సేతుపతి , నయనతార , జగపతి బాబు , బిగ్ బి అమితాబ్ , బ్రహ్మాజీ మొదలగు స్టార్ నటి నటులు నటిస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా ఈగ ఫేమ్ సుదీప్ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయినట్లు సమాచారం.
ఈగ చిత్రంతో టాలీవుడ్కి పరిచమైన సుదీప్.. కన్నడలో అగ్ర హీరోగా కొనసాగుతూ కూడా తెలుగు లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందాడు. ఆ క్రమంలోనే `బాహుబలి` చిత్రంలో ఓ అతిధి పాత్రలో నటించి మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని మురిపించాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సైరా లో కీలక రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇదే విషయాన్ని సుదీప్ అధికారికంగా ట్విట్టర్లో అభిమానులతో షేర్ చేసుకుని తన ఆనందాన్ని పంచుకున్నారు.“లెజెండ్ చిరంజీవి సర్- సురేందర్ రెడ్డి సర్తో కలిసి ఓ హిస్టారికల్ చిత్రంలో నటిస్తున్నా. నా కెరీర్లో ఇదే తొలి హిస్టారికల్ చిత్రం. సినిమా ప్రతిసారీ ఏదో ఒక క్షణం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది“ అంటూ ట్వీట్ చేశారు.
Cinema has always been kind by throwing surprises at me in regular intervals… Here's another ,,Sharing the screen with the Legend Chiranjeevi Sir in SYERAA.. under SurenderReddy sir,,also my 1st historical.
Excited ,,yess.
Worried,,yesssssss.— Kichcha Sudeepa (@KicchaSudeep) 9 July 2018