కేరింత చిత్రం లో నూకరాజు పాత్రతో శ్రీకాకుళం యాసను అవమానపరచి, అతని పాత్ర పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్నా, మరీ అమాయకంగా చిత్రీకరించడమే ఈ దాడికి కారణమని, అందుకే విద్యార్ధులు ఈ విధంగా నిరసన తెలిపినట్టు సమాచారం. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా మొదటివారం పూర్తి చేసుకొని రెండోవారం లోకి వెళ్ళింది..సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు.