పూరీ జగన్నాథ్ కు విగ్రహం

సాదారణంగా సినీ తారల పై అభిమానంతో గుడులు విగ్రహాలు నిర్మిస్తుంటారు. అయితే ఇప్పుడు ఓ దర్శకుడికి విగ్రహం నిర్మించడం ఆసక్తికరంగా వుంది. ఆ దర్శకుడు ఎవరో కాదు.. పూరి జగన్నాధ్.

కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వీరాభిమానిదర్శకుడు పూరీ జగన్నాథ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ ఈ విగ్రహాన్ని పూరీ తనయుడు ఆకాష్ తో ఆవిష్కరింపజేశాడు.

ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ, ఒక సినీ డైరెక్టర్ కు విగ్రహం ఏర్పాటు చేయడం అరుదైన సంఘటన అని, తన తండ్రి విగ్రహం ఏర్పాటు చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని, తన తండ్రిపై అభిమానంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కొండాపూర్ ప్రజలకు రుణపడి ఉంటానని, ఈ గ్రామం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు.