ఆమె అందాలు ‘నక్షత్రం’ను కాపాడుతాయా..??

nakshatram-movie-posterక్రియేటివ్‌ దర్శకుడు కృష్ణవంశీ ‘నక్షత్రం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడికి నిరాశే మిగిలేలా ఉంది. ఈ చిత్ర షూటింగ్‌ ఒక్క పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి అయ్యింది. రెజీనా, సందీప్‌ కిషన్‌, సాయి ధరమ్‌ తేజ్‌లు కీలకంగా నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు అంత కనెక్ట్‌ అవడం లేదు. ఈ చిత్రాన్ని కొనడానికి కూడా బయ్యర్‌లు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఇకపోతే సాయిధరమ్‌ తేజ్‌ చిత్రాలు కూడా ఈ మద్య పెద్దగా ఆడకపోవడంతో ఈయన క్రేజ్‌ కూడా ఏ మాత్రం ‘నక్షత్రం’కు ఉపయోగపడడం లేదు. అందుకే దర్శకుడు ఈ చిత్రాన్ని ఎలాగైనా లేపాలి అని పక్కా పథకాన్ని రచిస్తున్నాడు.

తన సినిమాలలో క్రియేటివిటి బాగా ఉపయోగించే దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రంలో ప్రత్యేక పాటను స్టార్‌ హీరోయిన్‌తో చేయించాలని ప్లాన్‌ చేస్తున్నాడు. సదరు టాప్‌ హీరోయిన్‌ చిందులేస్తే ఈ చిత్రానికి కాస్త బజ్‌ క్రియేట్‌ అవుతుందని భావించిన చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రస్తుతం ఆ హీరోయిన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ స్టార్‌ హీరోయిన్‌ అందాలు స్టెప్పులు, సాయి ధరమ్‌ తేజ్‌ డ్యాన్స్‌ కలిసిన ప్రత్యేక పాట ఈ చిత్రానికి ప్లస్‌ పాయింట్‌గా నిలవనుందట. దర్శకుడు ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నాడు. మరి ఆ స్టార్‌ హీరోయిన్‌ అందాలు, చిందులు ‘నక్షత్రం’ను కాపాడుతాయో చడాలి. ‘నక్షత్రం’పై యూనిట్‌ సభ్యులందరికి చాలా ఆశలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.