‘నక్షత్రం’లో సన్నీకి బదులు ఆమెను బుక్‌ చేశారు

క్రియేటివ్‌ దర్శకుడు కృష్ణవంశీ ప్రస్తుతం ‘నక్షత్రం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయిధరమ్‌ తేజ్‌, సందీప్‌ కిషన్‌, రెజీనా, ప్రగ్యా జైస్వాల్‌లు నటిస్తున్నారు. ఇంత మంది నటీనటులు ఉన్న కూడా ఈ చిత్రానికి పెద్దగా హైప్‌ రావడం లేదు. దాంతో ఏదైనా చేసి ఈ చిత్రాన్ని పైకి లేపాలి అని ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రత్యేక పాట మినహా షూటింగ్‌ అంతా పూర్తి అయ్యింది. ఈ ప్రత్యేక పాటతో బజ్‌ క్రియేట్‌ చేయాలని భావిస్తున్నాడు. అందుకే ఐటెం సాంగ్‌ను స్టార్‌ హీరోయిన్‌తో చేయించాలనుకుంటున్నాడు. మొదటగా ప్రత్యేక పాటలో నటించడానికి కాజల్‌ను సంప్రదించాడు. కానీ కాజల్‌ కాస్త ఎక్కువ డిమాండ్‌ చేసిందట.

కాజల్‌ తర్వాత కృష్ణవంశీ వేరే హీరోయిన్‌లను సంప్రదించారు. కానీ ఇంకా ఎవరు ఫిక్స్‌ కాలేదు. తెలుగులో ప్రస్తుతం సన్నిలియోన్‌ హవా సాగుతోంది. దాంతో సన్నిని ప్రత్యేక పాట కోసం ఎంపిక చేసుకోవాలనుకున్నాడు. కానీ సన్ని ఇంకా ఖరారు కాలేదు. తాజాగా చిత్ర యూనిట్‌ సీనియర్‌ హీరోయిన్‌ శ్రియాను సంప్రదించారట. గతంలో పలు సినిమాల్లో ప్రత్యేక పాటలో నటించిన శ్రియా ‘నక్షత్రం’లో కూడా చిందులేయనుంది అని సమాచారం అందుతోంది. ఈ చిత్రంలో ఐటెం సాంగ్‌లో నటించడానికి శ్రియా ఒకే చెప్పింది. వచ్చిన అవకాశాలను బాగా వాడుకుంటున్న శ్రియా త్వరలో షూటింగ్‌లో కూడా పాల్గోననున్నట్టు తెలుస్తోంది.