శ్రీను వైట్ల పంతం

Srinu-Vaitla‘బాద్ షా’ డివైడ్ టాక్, కోనవెంకట్ వివాదం నేపథ్యంలో మహేష్ తో చేస్తున్న సినిమాను ఎలాగైనా బ్లాక్ బస్టర్ చేసి, తన ఇమేజ్ నిలబెట్టుకోవాలని శ్రీను వైట్ల పంతంతో వున్నాడట. అందుకోసం తన సినిమాలకు ప్లస్ అయిన కామేడీ ట్రాక్ ను ఎలాగైనా వీలయినంత షార్ప్ గా ఉండాలని చూస్తున్నాడట. అందుకోసం చాలా హోం వర్క్ చేస్తున్నాడట. వీరభద్రమ్ సినిమాలు రెండింటికి పనిచేసిన మాటల రచయిత సీపానను కూడా తన క్యాంప్ లోకి తీసుకోవడంతో పాటు, మరో ఒకరిద్దరు కామెడీ ట్రాక్ రైటర్లను వాడుకోవాలని చూస్తున్నాడట. ఈ సినిమా హిట్ కొడితే, తన ఇమేజ్ నిలబడడమే కాకుండా, కోన వెంకట్ మళ్లీ తన క్యాంప్ కే వస్తాడని ఆశపడుతున్నాడని వినికిడి.