“బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం, పరుగు, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, శతమానం భవతి“ లాంటి ఎన్నో సూపర్డూపర్ హిట్ కుటుంబ కథా చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దిల్ రాజు.. గత ఏడాది డబుల్ హ్యాట్రిక్తో సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసాడు. ఇప్పుడు `శ్రీనివాస కళ్యాణం` సినిమాతో జీవితంలో పెళ్లి విశిష్టతను తెలియజేప్పే ప్రయత్నం చేస్తున్నారు.
14 ఏళ్ల క్రితం హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు, నితిన్ కాంబినేషన్లో వచ్చిన ‘దిల్’ చిత్రం ఇద్దరికీ ఎంత ఉపయోగపడిందో..చెప్పాల్సిన పనిలేదు. అలాంటి కాంబో చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 9 న`శ్రీనివాస కళ్యాణం`తో రాబోతున్నారు.. గత ఏడాది జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన `శతమానం భవతి` చిత్రాన్ని రూపొందించిన డైరెక్టర్ సతీశ్ వేగేశ్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ మధ్యనే విడుదల చిత్రంలోని మొదటి సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పెళ్లి పాట ‘ఈ ఏడాది ఉత్తమ పెళ్లి పాట ’ అవుతుందని ఇకనుండి ప్రతి పెళ్లి ఆల్బం లో ఈ సాంగ్ తప్పకుండ ఉంటుందనే ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యం లో ఈ చిత్ర కాన్సెప్ట్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సీనియర్ నటి జయసుధ ఈ కాన్సెప్ట్ టీజర్ గురించి చెప్పుకొచ్చింది.
మనం పుట్టినప్పుడు మనవాళ్లందరూ ఆనందం పడతారు అది మనకు తెలియదు.. మనం దూరం అయినప్పుడు మనవాళ్లు అంత బాధపడతారు అది మనకు తెలియదు.. మనకు తెలిసి మనం సంతోషం గా ఉండి, మనవాళ్లు సంతోషం గా ఉండేది ఒక్క పెళ్లిలోనే అలాంటి పెళ్లి గొప్పతనం గురించి చెప్పే చిన్ని ప్రయత్నమే మా ‘శ్రీనివాస కళ్యాణం’ అంటూ జయసుధ ఎంతో చక్కగా చెప్పి సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. మీరు కూడా ఆ టీజర్ ఫై లుక్ వెయ్యండి.
నితిన్, రాశీఖన్నా, నందితా శ్వేత, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రామాంజనేయులు, ఎడిటింగ్: మధు, సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ : బండి రత్న కుమార్, సంగీతం: మిక్కి జె.మేయర్, నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, కధ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: వేగేశ్న సతీష్.