తెలుగు బిగ్బాస్లో టాప్ కంటెస్టెంట్గా దూసుకు పోతున్న శ్రీముఖిపై గత వారం రోజులుగా తీవ్రమైన ట్రోలింగ్ సాగుతోంది. ఒక జాతీయ మీడియాలో కూడా శ్రీముఖి గురించిన కథనాలు వరుసగా వస్తుండటంతో ఆమె ఇమేజ్ డ్యామేజీ అవుతోంది. ఇటీవల రాహుల్ను బ్లాక్ షీప్ అంటూ విమర్శించిన కారణంగా ఆమెకు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీముఖి తమ్ముడు శుష్రుత్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తన సోదరిపై సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారని, అలాగే ఒక మీడియా సంస్థ తన సోదరి ఇమేజ్ను చెడగొట్టేలా ఆమెపై లేని పోని కథనాలను ప్రచురితం చేస్తుందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. శ్రీముఖి పై సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్, బ్యాడ్ ట్రోల్స్ ఆపకుంటే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని భావిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే ఈ విషయమై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు.