శ్రీదేవి ముద్దు పేరు ఏంటో తెలుసా ?


అతిలోక సుందరి శ్రీదేవికి భారతరత్న ఇవ్వాలని అలనాటి నటి ఊర్వశి శారద కోరారు. గురువారం రాత్రిశ్రీదేవి సంతాప సభ నిర్వహించారు. ఆమెకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ… ‘‘వయసులో తప్ప మిగిలిన అన్నింటిలోనూ నా కంటే శ్రీదేవి గొప్ప స్థాయికి చేరుకుంది. ‘మల్లమ్మకథ’ చిత్రంలో తనతోపాటు కలిసి నటించడం నాకు దక్కిన భాగ్యం. ‘కార్తీకదీపం’ చిత్రంలో తన నటనతో నన్ను, శోభన్‌బాబును నిలబెట్టేసింది. ఆమెను మేమంతా ‘పప్పీ’ అని పిలిచేవాళ్లం. ఆ కోహినూరు వజ్రానికి భారతరత్న ఇవ్వాల’ని కోరారు శశారద.

శ్రీదేవి తన అభినయం, అందతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. మూడు తరాల నటులతో కలసి ఆడిపాడిన ఏకైక నటిగా ఆమె ప్రత్యేక చాటారు చిన్నవయసులోనే ఈ లోకం నుంచి విడిచిపోవడం తీరని లోటని సంతాప సభలో పలువురు వ్యాఖ్యానించారు.