Site icon TeluguMirchi.com

పాపం.. శ్రీదేవి బిడ్డలు

శ్రీదేవి గురించి ఇప్పుడు మళ్ళీ పరిచయ వాఖ్యలు అవసరం లేదు. 55 ఏళ్ళ శ్రీదేవి యాభై ఏళ్ళు సినిమాతోనే గడిపింది. బాల నటిగా ఇండస్ట్రీలో వచ్చిన శ్రీదేవి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సాధించి నెంబర్ వన్ కధానాయిక గాప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. అలాంటి శ్రీదేవి హఠాన్మరణం చిత్ర పరిశ్రమను ఆమె అభిమానులను తీవ్రంగా కలచివేసింది.

ఆమెను కోల్పోవడం చిత్ర పరిశ్రమకు ఒక లోటు. అయితే ఆమె కుటుంబానికి ఇది ఎన్నటికీ తీరని లోటు. శ్రీదేవి బిడ్డలు ఇప్పుడు పిల్లలు తల్లిలేని పిల్లలయ్యారు. ఇప్పుడు ఆ పిల్లల్ని ఓదార్చిడం ఎవరి వల్ల కావడం లేదు. తల్లి మరణవార్త విన్న కూతురు జాన్వి కుప్పకూలిపోయారు. ఈ కష్ట సమయంలో ఆమెకు ధైర్యం చెప్పడానికి దర్శక, నిర్మాత కరణ్‌జోహార్‌ లోఖండ్‌వాలాలోని శ్రీదేవి ఇంటికి వెళ్లారు. ఆమెను జూహూలోని అనిల్‌ కపూర్‌ ఇంటికి తీసుకెళ్లారు. భారత్‌లో ఉన్న కపూర్‌‌ కుటుంబ సభ్యులంతా శ్రీదేవి మృతితో జుహూలోని ఆమె ఇంటికి వెళ్లారు. మరో కూతురు ఖుషీ దుబాయిలో ఉంది.

Exit mobile version