Site icon TeluguMirchi.com

రేపు శ్రీదేవి అంత్యక్రియలు


శ్రీదేవి అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. సోమవారం రాత్రి 10గంటల ప్రాంతంలో ఆమె పార్థీవ దేహం ముంబయి చేరుకోనుంది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రైవేట్‌ విమానంలో ఆమె పార్థీవ దేహాన్ని తీసుకురానున్నారు. ముంబయి చేరుకున్న తర్వాత కడసారి చూసేందుకు తరలి వచ్చిన ప్రముఖులు, అశేష అభిమానులకోసం శ్రీదేవికి ఇష్టమైన భాగ్య బంగ్లాలో ఆమె భౌతిక కాయాన్ని ఉంచనున్నారు.

దుబాయ్‌లోని ఓ వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగి మరణించారు. ఆమె మరణం వెనుక ఎలాంటి కుట్రలేదని ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడైంది. ఈ నివేదికను అక్కడి అధికారులు భారత కాన్సులేట్‌ అధికారులకు అందజేశారు. ఈరోజు సాయంత్రం 5.30గంటలకు దుబాయ్‌ నుంచి ప్రత్యేక విమానంలో శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్‌కు తరలించనున్నారు.

Exit mobile version