కన్నీళ్ళు తెప్పిస్తున్న శ్రీదేవి కూతురు లేఖ

అతిలోక సుందరి శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ ఆమె పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌ రాసిన లేఖ కన్నీళ్లు తెప్పిస్తుంది. బరువెక్కిన గుండెతో తల్లే తన ప్రపంచం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ రాసిన ఈ లేఖను చదివితే కళ్ళు చమరుస్తున్నాయి.

‘నా మనసులో తీరని లోటు ఒకటి ఏర్పడింది. దాంతో ఎలా జీవించాలన్న విషయాన్ని నేర్చుకోవాలి. ఇంతలోటు ఉన్నప్పటికీ ఇంకా నేను నీ ప్రేమ అనుభూతిని పొందుతున్నాను. నువ్వు చాలా మంచిదానివి, చాలా స్వచ్ఛమైన వ్యక్తివి, ప్రేమమూర్తివి. అందుకే దేవుడు నిన్ను తిరిగి తీసుకెళ్లిపోయాడు. నా స్నేహితులు ఎప్పుడూ ‘నువ్వు హ్యాపీగా ఉంటావు’ అంటుండేవారు. ఆ సంతోషానికి కారణం నువ్వేనని నాకు ఇప్పుడు అర్థమైంది. నీ జీవితాన్ని మొత్తం ఇచ్చేశావు. ఇప్పుడు నీ కోసం అదే చేయాలి అనుకుంటున్నా అమ్మా. నువ్వు గర్వపడేలా చేస్తాను. నిన్ను చూసి నేను ఎంత గర్వపడ్డానో.. అదే స్థాయిలో నన్ను చూసి నువ్వు గర్వపడే రోజు వస్తుందని ఆశిస్తూ పనిచేస్తా. ఇదే ఆలోచనతో ప్రతిరోజు నిద్రలేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా. ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉన్నావు. దాన్ని నేను అనుభూతి చెందుతున్నా. మేము జీవించడానికి అది చాలు. కానీ నీ లోటును తీర్చడానికి మాత్రం అది సరిపోదు’ అని జాన్వీ రాసిన లేఖ చదివివారికి కన్నీళ్లు తెప్పిస్తుంది.