శ్రీదేవి భౌతిక కాయం కుటుంబానికి అప్పగింత

దుబాయ్‌లో కన్నుమూసిన అతిలోక సుందరి శ్రీదేవి భౌతిక కాయం కుటుంబానికి అప్పగించడానికి లైన్ క్లియర్ ఐయింది. ఆమె భౌతికకాయం అప్పగింతలో మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ పార్థివదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు దుబాయ్‌ పోలీసులు అంగీకరించారు.

శ్రీదేవి భౌతికకాయాన్ని తమ అధీనంలోంచి విడుదల చేసేందుకు అనుమతిస్తూ.. దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయానికి, ఆమె భర్త బోనీ కపూర్‌కు లేఖలు అందించారు. దీంతో శ్రీదేవి భౌతికకాయాన్ని ఎంబామింగ్‌ చేసి.. తరలించే ప్రక్రియ ప్రారంభమైంది.

శ్రీదేవి భౌతికకాయం తరలింపు విషయంలో మంగళవారం కూడా తీవ్ర జాప్యం జరిగింది. దీంతో కుటుంబసభ్యులు ఆమె పార్థీవదేహాన్ని తరలించేందుకు ఉదయం నుంచి చాలాసేపు ఎదురుచూశారు. ఈ ప్రక్రియ ఆలస్యంగా అవుతుండటంతో తండ్రితో ఉండటానికి అర్జున్‌కపూర్‌ కూడా దుబాయ్‌ బయలుదేరిన సంగతి తెలిసిందే. మరికొద్ది సేపట్లో శ్రీదేవి భౌతిక కాయం రానుంది