తెలుగులో బిజీ అవుతానంటున్న శ్రద్ద..

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్..ప్రస్తుతం సాహో చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది. బాహుబలి ఫేమ్ ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్ కార్య క్రమాలు మొదలుపెట్టింది. రీసెంట్ గా రిలీజ్ అయినా టీజర్ అంచనాలు రెట్టింపు చేసింది.

తాజాగా హీరోయిన్ శ్రద్ద కపూర్ మీడియా తో మాట్లాడుతూ.. సాహో లో కాప్ పాత్ర బాగుందని, బాగా చేశానని తెలిపింది. ఫ్యూచర్ లో తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపి అభిమానులను ఆకట్టుకుంది. యువీ క్రియేషన్స్ బ్యానర్ ఫై ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల అవుతుంది.