ఓరేంజ్ లో బాలీవుడ్ ని ఏలుతున్న సోనాక్షీ రీమేక్ సినిమాలతో సందడి చేస్తుంది……గతంలో మహేష్ బాబు, భూమిక జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో మనకు తెలుసు. ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను ఆమధ్య శ్రీదేవి భర్త బోనీకపూర్ పెద్ద రేటుకి తీసుకున్నాడు. ఇప్పుడీ చిత్రాన్ని తన తనయుడు అర్జున్ కపూర్ తో రీమేక్ చేయడానికి బోనీ సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులో కథానాయికగా భూమిక పాత్రలో నటించడానికి బాలీవుడ్ హాట్ సోనాక్షి సిన్హా సంతకం చేసింది. ఈ చిత్రానికి అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది సెట్స్ కి వెళుతుంది.సో… సోనాక్షి ‘నువ్వే మాయ చేసావో ‘ అంటూ మాయ చేయబోతుందన్నమాట.