ఇంత‌కీ “ప్రాజెక్ట్ కె” లో ఎవ‌రీ రైడ‌ర్స్‌ ?


బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. ఇప్పటికే నాలుగైదు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా వున్నారు. అందులో ప్రతిష్టాకమైన మూవీ “ప్రాజెక్ట్ కె” ఒకటి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్‌ నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుండి ఇది వరకే పలు క్రేజీ పోస్టర్స్ తో పాటుగా ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు కూడా రెండో మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.

స్క్రాచ్ నుంచి రెండో భాగం అంటూ ఈసారి సినిమాలో రైడర్స్ లుక్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది రివీల్ చేశారు. ఇంత‌కీ ప్రాజెక్ట్ కె లో రైడ‌ర్స్ ఎవరంటే.. వారంతా విల‌న్ ఆర్మీ. ఇక విలన్స్ ఆర్మీ వారికి సెపరేట్ సూట్ ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో డిజైన్ చేసి చూపించారు. కాగా సినిమా ప్రారంభం నుంచి ఈ మూవీ పాన్ ఇండియా స్టాయికి మించి పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్ లో ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ చెబుతూ వ‌స్తున్నారు. తాజాగా విడుద‌ల చేసిన వీడియో ఆ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ ఎక్స్ పెక్టేష‌న్స్ ని పెంచేసింది.

ఇకపోతే రూ. 500 కోట్ల‌తో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, క్రేజీ స్టార్స్ దీపిక ప‌దుకోనె, దిషా ప‌టాని హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. కాగా `ప్రాజెక్ట్ కె` 2024, జ‌న‌వ‌రి 12న సంక్రాంతి కానుకగా విడుద‌ల కానుంది.