మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 151 వ సినిమా ఫై అప్పుడే విమర్శలు మొదలు అయ్యాయి. బ్రిటీష్ వారు ఎలా మన దేశానికి వచ్చి మన కోటలపై వారి జెండాలను ఎగరవేశారో.. ఎలాగైతే ఆ జెండాలను తగలబెట్టి ఉయ్యాలవాడ ఒక రెబెల్ లా తయారై వారిని గడగడలాడించాడో అనే కథతో చిరు రాబోతున్నాడు. ఈ మూవీ కి సైరా నరసింహ రెడ్డి గా ప్రకటించారు.
ఇదివరకు ఈ మూవీకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రెడ్డి అని అనుకున్నారు కానీ ఇప్పుడు సినిమా పేరు మార్చి.. ‘సైరా’ టైటిల్ను ఖరారు చేసింది. సినిమా పేరు మార్చడంపై ఉయ్యాలవాడ వారుసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశభక్తుని జీవితగాథతో ఈ మూవీ తెరకెక్కబోతోంది. అలాంటి ఈ మూవీ కి ఆ టైటిల్ పెట్టడం ఏంటి అని వారు వాపోతున్నారు. మరి ఏది ముందు ముందు ఎలాంటి వాటికీ దారి తీస్తుందో చూడాలి. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు నిర్మాతగా రాంచరణ్, సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. ఏఆర్ రెహ్మాన్ బాణీలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్గా నయనతార నటిస్తోంది.