Site icon TeluguMirchi.com

బాహుబలిని బ్లాక్ లో చుసిన సిఎం.. విమర్శలు

బాహుబలి ప్రభంజనం కొనసాగుతొంది. టికెట్ల కొరత ఇంకా ఉంది. ఈ మేనియా ఎంత పీక్స్ లో వుందో చేప్పే మరో ఉదారహణ ఇది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బాహుబలి 2ని బ్లాక్ లో చూశారు. సినిమా టికెట్ ధ‌ర రూ.200 మించొద్దు అని సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఆయన రూల్స్ ను పక్కన పెట్టారు.

తాను, త‌న కుమారుడు, మ‌న‌వ‌లు ఇలా ఓ 40 మంది ప‌రివారంతో ఈ సినిమా చూశారు క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య‌. ఒక్కో టికెట్‌కు ఆయ‌న చెల్లించిన మొత్తం ఎంతో తెలుసా.. అక్ష‌రాలా రూ.1050. అంటే ఆయ‌న పెట్టిన ప‌రిమితికి ఐదు రెట్లు ఎక్కువ‌. బెంగ‌ళూరులోని ఓరియ‌న్ మాల్‌లోని గోల్డెన్ క్లాస్‌లో సాధార‌ణ ప‌బ్లిక్‌తో క‌లిసి ఆయ‌న సినిమా చూశారు.

త‌న మ‌న‌వ‌లు క‌చ్చితంగా సినిమా చూడాల‌ని ఒత్తిడి చేయ‌డంతో సిద్ధ‌రామ‌య్య త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో వెళ్లార‌ని సీఎంవో వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఐతే ఒక సిఎం సినిమాని బ్లాక్ టికెట్టు రూపంలో చూడ్డంపై సర్వాత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version