శృతిహాసన్ కు అస్వస్థత!

Shruti-Hassanహీరోయిన్ శృతిహాసన్ కి అనారోగ్యానికి గురైంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొంది. తిరిగి వెళ్తుండగా.. కడుపునొప్పితో తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో.. ఆమెను అపోలో అసుపత్రిలో చేర్పించారు. కడుపునొప్పికి కారణం అపెండిసైటిస్ గా తేలడంతో.. ఆమెకు శస్త్రచికిత్స చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శృతి బాగానే వుందని వైద్యులు చెబుతున్నారు. శృతి నటించిన ’ఎవడు’ మూవీ రీలిజ్ కు రెడీగా వుంది.