తమిళ స్టార్ హీరో అజిత్ ప్రధాన పాత్రలో నటించిన ‘నెర్కొండ పార్వై’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రంలో అజిత్ తన ఇమేజ్కు పూర్తి భిన్నంగా నటించాడు. లాయర్గా అమ్మాయిల తరపున పోరాడే వ్యక్తిగా అజిత్ కనిపించాడు. ఇక ఈ చిత్రంపై అజిత్ అభిమానులతో పాటు తమిళ ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో సినిమా విడుదలకు ముందే పైరసీ అయ్యింది.
ఓవర్సీస్లో ఈ చిత్రంను మూడు రోజుల ముందే ప్రీమియర్లు వేయడం మొదలు పెట్టారు. అక్కడ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అదే సమయంలో సినిమా పైరసీ కూడా అప్పుడే వచ్చింది. ఆన్లైన్లో ‘నెర్కొండ పార్వై’ చిత్రం పైరసీ కాపీ ఉండటంతో నిర్మాత బోనీ కపూర్ షాక్ అవుతున్నాడు. విదేశాల్లో చిత్రం విడుదలైన వెంటనే దాన్ని పైరసీ చేశారు. ప్రింట్ కూడా చాలా బాగా ఉండటంతో సినిమాను ఇక జనాలు థియేటర్లకు వస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.