సినీ కుటుంబం నుంచి మరో కథానాయిక రాబోతోంది. ఆమే.. శివానీ. రాజశేఖర్ – జీవితల గారాల పట్టీ శివానీ. ఆమె సినీ రంగ ప్రవేశం గురించి చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. ఇప్పుడు వాటిని నిజం చేశారీ దంపతులు. శివానీని కెమెరా ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. ఈ చిత్రానికి వందకి వంద అనే పేరు ఖరారు చేశారు. జీవిత దర్శకత్వం వహిస్తారు. ఇటీవల ట్రైల్ షూట్ కూడా జరిగింది. శివానీ పై అన్ని విధాల సంతృప్తి చెందిన జీవిత.. ఈ కథని సెట్స్పైకి తీసుకెళ్లడానికి కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారమ్. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.