Site icon TeluguMirchi.com

మరోసారి సాయి పల్లవి తో శేఖర్ కమ్ముల..

శేఖర్ కమ్ముల..టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూల్ డైరెక్టర్..చేసింది తక్కువ సినిమాలే కానీ ఫీల్ గుడ్ సినిమాలను అందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కొత్త నటి నటులతో డాన్స్ నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత మరోసారి ఫిదా బ్యూటీ తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.

సాయి పల్లవి , వరుణ్ తేజ్ జంటగా ఫిదా సినిమాను తెరకెక్కించారు శేఖర్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో..ఈ సినిమా వల్ల సాయి పల్లవి కి ఎంత పేరు వచ్చిందో తెలియంది కాదు. ఇప్పుడు మరోసారి సాయి-శేఖర్ అనగానే అంచనాలు పెరగడం ఖాయం. ఇక ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా అక్కినేని నాగ చైతన్య.

ప్రస్తుతం నాగచైతన్య కెరీర్ ఫుల్ స్పీడ్ లో వుంది. వెంకటేష్ తో కలిసి వెంకీమామ చేస్తున్నాడు. అతి త్వరలో ఈ సినిమా పూర్తి కానుంది. దాని తరువాత బంగార్రాజు సినిమా ను నాగ్ తో కలిసి చేయబోతున్నాడు. అలాగే యువి బ్యానర్ లో మేర్లపాక గాంధీ సినిమా , దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా ప్లానింగ్ లో వుంది. ఈ సినిమాలు లైన్లో ఉండగానే శేఖర్ తో సినిమాకు ఓకే చెప్పాడు. మరి వాటి కంటే ముందు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందా..లేక అవే వస్తాయా అనేది చూడాలి.

Exit mobile version