యువనటుడు శర్వానంద్ సినిమాలకు స్వస్తి చెబుతున్నాడా? గత కొన్ని రోజుల నుంచీ నెట్ ప్రపంచంలో చక్కర్లు కొడుతున్న వార్త ఇది. తనకు సరైన అవకాశాలు రావడం లేదని, పారితోషికం కూడా ఎగ్గొడుతున్నారని. ప్రతిభకు గుర్తింపు దక్కడం లేదని తెగ ఫీలైపోయి.. ఈ నిర్ణయం తీసుకొన్నాడట. దాంతో పాటు మరో కారణం కూడా ఉంది. శర్వానంద్ ఈమధ్య నిర్మాతగా మారి కో అంటే కోటి సినిమా తీశాడు. అది కాస్తా.. కోట్లు పట్టుకెళ్లిపోయింది. దాంతో మరింత హర్టయ్యాడు. ఇక సినిమాలు తనకు అచ్చురావని డిసైడ్ అయ్యాడట. కొత్త కథలు వినడానికి సముఖత చూపించడం లేదని టాలీవుడ్ టాక్. తనకు కొన్ని హోటల్లు ఉన్నాయి. వాటపై దృష్టి పెట్టినా నాలుగు డబ్బులొస్తాయి అనుకొంటున్నాడట. శర్వా నటించిన ఏమిటో ఈమాయ త్వరలోనే విడుదల కానుంది. దానితో పాటు సత్య 2 కూడా ఉంది. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి ఆడినా, శర్వానంద్ తన నిర్ణయం మార్చుకోవడం ఖాయమని శర్వానంద్ సన్నిహితులు చెబుతున్నారు.