శర్వా.. తప్పు చేస్తున్నావేమో కాస్త ఆలోచించు

విభిన్నమైన రీతిలో సాగిపోయే కథలను ఎంచుకుంటూ తనకు పరిపోయే పాత్రల్లో జీవించి వరుస హిట్‌లతో తన ఖాతాలో వేసుకుని శర్వానంద్‌ తాజాగా ‘రాధ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా రొటీన్‌ కథతో రావడంతో ప్రేక్షకులు పెద్దగా ఈ చిత్రంపై ఆసక్తి చూపడం లేదు. శర్వానంద్‌ ఇదేమి పట్టించుకోకుండా హాయిగా తదుపరి చిత్రాలకు ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ‘స్వామిరారా’ చిత్రంతో మంచి హిట్‌ను అందుకున్న దర్శకుడు సుధీర్‌ వర్మ ఆ తర్వాత ‘దోచేయ్‌’ చిత్రంతో నిరాశ పరిచాడు. మూడో చిత్రంగా ‘కేశవ’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

‘కేశవ’ ఫలితం ఎలా ఉంటుందో కూడా చూడకుండా శర్వానంద్‌ తదుపరి చిత్రాన్ని సుధీర్‌ వర్మతో చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఫలితాలను చూడడం కాకుండా ఆయన మీద ఉన్న నమ్మకంతోనే ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. కానీ శర్వా తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు సందేహ పడుతున్నారు. శర్వా… తప్పు చేస్తున్నావేమో కాస్త ఆలోచించి అవకాశం ఇవ్వరాదు. ఇప్పటికే ఓ ఫ్లాపు వచ్చింది, వరుస ఫ్లాపులు వస్తే మళ్లీ నిలదొక్కుకోవడం కష్టం అని అభిమానులు హితవు పలుకుతున్నారు. కానీ శర్వా మాత్రం ఏం ఆలోచించకుండా సుధీర్‌ వర్మకు అవకాశం ఇచ్చేశాడు.