Site icon TeluguMirchi.com

‘మనోహరుడు’ 100 కోట్లకు దాటడట!

vikramదక్షినాది సినిమా క్రియేటివ్ దర్శకులలో శంకర్ ఒకరు. బెస్ట్ టెక్నిషియన్స్ ని పెట్టుకుని తెర మీద అద్బుతాలు చూడడంలో శంకర్ ‘ఒకే ఒక్కడు’. ‘జీన్స్’ దగ్గర నుండి ‘రోబో’ వరకూ తాను చేసే ప్రతి చిత్రంలో కొత్త విజువల్స్ చూపించారు.ఇప్పుడు శంకర్ విక్రమ్ తో ‘మనోహరుడు’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కుడా లో గ్రాఫిక్స్ వర్క్ ప్రధాన ఆకర్షణ నిలుస్తుందని యూనిట్ వర్ఘాల సమాచారం. అయితే ఇప్పటికే ఈ చిత్రం 150కోట్ల బడ్జెట్ దాటిందని మరో వార్త వినిపిస్తుంది. ఈ వార్తాను ఖండించాడు దర్శకుడు శంకర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లకు మించదని తెలిపాడు. అంతేకాకుండా ‘కొడైకెనాల్లో చైనా సెట్ వేశానని వస్తున్న వార్తలు కూడా నిజం కావు’ అన్నాడు. చైనాలో తాననుకున్న సన్నివేశాలకు అన్ని లొకేషన్లలోనూ అనుమతి లభించిందని పేర్కొన్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో విక్రమ్, యామి జాక్సన్ ప్రధాన పాత్రలు పోషించగా ఆస్కార్ రవిచంద్రన్ 100 కోట్ల బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version