అంబటిరాయుడి బయోపిక్ పై సందీప్ కిషన్ దృష్టి…!

వరల్డ్ కప్ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించి సెలక్టర్ల పై సంచల ఆరోపణలు చేసిన అంబటి రాయుడు బయోపిక్ తెరకెక్క నుందా…హీరో సందీప్ కిషన్ వ్యాఖ్యలు చూస్తే అవుననే సమాధనమే వినిపిస్తుంది. మూడేళ్ల తర్వాత ‘నిను వీడని నీడను నేనే’ తో సక్సెస్ కొట్టిన సందీప్ దీనిపై రీసెంట్ గా హింట్ ఇచ్చారు. క్రికెటర్‌ అంబటిరాయుడు బయోపిక్‌లో నటించాలని చాలామంది ట్విట్టర్‌ ద్వారా కోరుతున్నారు. అయితే అందుకు అంబటిరాయుడు ఒప్పుకుంటే తప్పకుండా నటిస్తా అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. బయోపిక్‌లో సరైన కథ వస్తే కచ్చితంగా చేస్తా. అటువంటి సినిమాలో నటించేందుకు ప్రాణం పెడతా అన్నాడు సందీప్ కిషన్.

ఇంకా రెండు ప్రాజెక్టులు ఫైనల్‌ కావాల్సి ఉంది. అలాగే ‘వెంకట్రాది ఎక్స్‌ప్రెస్‌-2’ చేయాలనుకుంటున్నా అన్నారు సందీప్. ప్రస్తుతం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’లో నటిస్తున్నాడు సందీప్. దీనికి జి.నాగేశ్వరరెడ్డి దర్శత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా హన్సిక నటిస్తోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పర్సనల్‌గా సినిమా బాగుందని ట్వీట్‌ చేయడం హ్యాపీగా ఉందన్నారు. కేటీఆర్‌ నాకు పర్సనల్‌గా కూడా కాన్ఫిడెంట్‌గా కనిపించే వ్యక్తి. అలాగే ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అంటే నాకు అభిమానం అన్నారు సందీప్.