సమంత..టాలీవుడ్ లోనంబర్ వన్ హీరోయినిగా చెలామణి అవడమే కాదు ..తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ కూడా..అటువంటి ఆమెకు చేదు అవమానం ఎదురయ్యింది. తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా సమంతని ఎంపిక చేసి, ఆమెను స్వయంగా సన్మానించారు మంత్రి కేటీఆర్..ఇక సమంత కూడా రంగంలోకి దిగి తన పనిని ప్రారంభించేసింది. చేనేత కార్మికులను కలిసి వారి ఇబ్బందుల్ని తెలుసుకుంది. పలువురు డిజైనర్లను తీసుకొచ్చి, చేనేత కార్మికులకు సలహాలు ఇప్పించింది.
ఇంతా చేశాక, ఇప్పుడు సమంత అసలు తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడరే కాదట. ఈ విషయం సమాచార హక్కు చట్టంతో వెలుగు చూసింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడ్డంతో, మంత్రి కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. సంబంధిత అధికారితో వివరణ ఇప్పించారు. చేనేతకు సంబంధించిన అధికారి (టెస్కో డైరెక్టర్) శైలజా రామయ్యర్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
సమంతని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా గుర్తించామనీ, సమాచార లోపంతోనే చిన్న పొరపాటు జరిగిందనీ, సమంత సేవల్ని తెలంగాణ ప్రభుత్వం, టెస్కో వినియోగించుకుంటాయనీ సెలవిచ్చారు. బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేశాక, ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోకపోవడమంటే, అంతకన్నా అవమానకరం మరోటి లేదంటూ అంత మండిపడ్డారు.