Site icon TeluguMirchi.com

’ఎవడు’కు సమైక్య సెగ..!

yevaduకేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి సమైక్యవాదులు అల్టిమేటం జారీ చేశారు. ఈ నెల 7 వ తేదీలోగా చిరంజీవి తన మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనకుంటే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తోందని హెచ్చరించారు. సమైక్యవాదులతో కలసి రాకుంటే.. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ నటించిన ’ఎవడు’ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. కేంద్రమంత్రి పదవుల కోసం సమైక్య రాష్ట్రాన్ని విడగొడుతున్నా తమ ప్రాంత నేతలు చూస్తూ కూర్చున్నారని మండిపడ్డారు. సమైక్య సెగ తాకడంతో ’ఎవడు’ సినిమా షెడ్యూల్ ప్రకారమే విడుదలవుందా..? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Exit mobile version