ఫిదా , ఎంసిఏ , పడి పడి లేచే మనసు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి..ప్రస్తుతం నీదీ నాదీ ఒకే కథ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వం 1992 అనే చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీలో రానా హీరో గా నటిస్తుండగా , ఆయన సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది.
పీరియాడిక్ సోషల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ధరిపల్లి అనే గ్రామంలో తొలి షెడ్యూల్ పూర్తీ చేసుకుంది. రెండో షెడ్యూల్ అతి త్వరలో మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో రానా జాయిన్ కానున్నాడు. అయితే తొలి షెడ్యూల్లో సాయి పల్లవి షూటింగ్లో పాల్గొనగా, ఆమెకి సంబంధిచిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పల్లెటూరి పిల్లగా సైకిల్ తొక్కుతున్న సాయి పల్లవి లుక్ అభిమానులని ఆకట్టుకుంటుంది.
వైజాగ్కి చెందిన అలనాటి బాలీవుడ్ నటి జరీనా వాహబ్ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడట. అలానే టబు పాత్ర కూడా కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుందని అంటున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.